
తిరుమల: టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉద్యోగుల కోసం కేటాయించాలని గతేడాది డిసెంబర్లో టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి జగన్ సర్కార్ అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగతించారు.
Be the first to comment