కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదుతోపాటు రూ. 10లక్షల జరిమానా…

 

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్‌ NIA కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది.

  • జీవిత ఖైదుతోపాటు రూ. 10లక్షల జరిమానా విధించింది.
  • పదేళ్లు కఠిన కారాగార శిక్ష, మరో ఐదేళ్లు ఉపా చట్టం కింద శిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చింది.
  • అంతకుముందు సెక్షన్ 121 కింద యాసిన్‌ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టులో వాదనలు వినిపించింది.
  • ఈ సెక్షన్ కింద ఉరి మ్యాగ్జిమమ్‌ పనిష్‌మెంట్‌ కాగా.. అతితక్కువ అంటే యావజ్జీవమే.
  • ఈ నేపథ్యంలో యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
  • కేసు విచారిస్తున్న రాజీవ్‌ కుమార్‌ శర్మ సెలవుల్లో ఉన్నందున స్పెషల్‌ జడ్జీ ప్రవీణ్‌ సింగ్‌ తన తీర్పును వెల్లడించారు.
  • మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి.
  • ఈ కేసులో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా NIA ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*