
తిరుపతి: తిరుపతిలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు.
అన్నమయ్య సర్కిల్ మద్యం సేవించిన ఓ వ్యక్తి పట్ల దారుణం ప్రవర్తించాడు.. ఓవరాక్షన్తో బూటు కాలితో తన్నారు. కానిస్టేబుల్ కర్రతో దాడి చేయగా మద్యం సేవించిన వ్యక్తి కర్రను గట్టిగా పట్టుకోవడంతో మరింత రెచ్చిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయి కాలితో తన్నాడు. ఈ దాడి ఘటనను కొంతమంది వాహనదారులు మొబైల్లో రికార్డ్ చేయడంతో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా చేయడం సరికాదంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Be the first to comment