చికాగోలో జరిగిన కాల్పుల్లో విజయవాడ విద్యార్థి మృతి…

 

చికాగోలో తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపిన ఘటనలో విజయవాడకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. కాగా.. ఈ కాల్పుల్లో గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విజయవాడకు చెందిన దేవాన్ష్, హైదరాబాద్‌కు చెందిన సాయిచరణ్.. మరో విద్యార్థితో కలిసి వాల్‌మార్ట్‌కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దేవాన్ష్, సాయిచరణ్ శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అయితే.. తీవ్రగా గాయపడిన వీళ్లిద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ.. దేవాన్ష్ ప్రాణాలు దక్కలేదు. మరోవైపు.. సాయిచరణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది.

కాగా.. ఈ విషయం తెలిసి దేవాన్ష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పై చదువుల కోసం వెళ్లిన తమ కుమారుడు కాల్పుల్లో చనిపోవటాన్ని తట్టుకోలేక గుండెలు బాదుకుంటున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌కు చెందిన కొప్పాల సాయి చరణ్.. పై చదువుల కోసం జనవరి 11వ తేదీన చికాగోకు వెళ్లగా.. ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. ఈ విషయం అతని స్నేహితుల ద్వారా తెలుసుకున్న సాయి చరణ్ తల్లిదండ్రులు తీవ్రం ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని తెలిసి కొంత ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*