ఆమర నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న పెంటేల బాలాజీ…?

 

పల్నాడు జిల్లా చిలకలూరిపేట: పట్టణంలోని TIDCO గృహాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని 45 00 ఇళ్ళకు గృహప్రవేశాలు అని చెప్పేసి ఆర్భాటం చేసి చివరికి పది మందికి తాళాలు ఇచ్చారు.

  • ఆ పది మంది అక్కడ కరెంటు. నీళ్లు .డ్రైనేజీ లేక లబ్ధిదారులు తాళాలు వేసి తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయారు.
  • మరియు కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా ఇచ్చిన గృహాలని అగ్రిమెంట్లు చేసుకొని అమ్ముకుంటున్నారు.
  • మీరు ఫిబ్రవరి 10వ తారీఖు లోపు చిలకలూరిపేట లోని టీట్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకపోతే జనసేన పార్టీ నుండి నేను మా కార్యకర్తలు 10వ తారీఖున ఆమర నిరాహార దీక్ష చేస్తాము.
  • అలాగే చిలకలూరిపేటలో మీరు చేసిన అభివృద్ధి శూన్యం.
  • మీకు అవార్డులు వచ్చాయి అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారు .
  • వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బందికి జీతాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మీకు అవార్డులు ఎలా వచ్చాయి.
  • అమ్మ ఒడి విద్యార్థులకు ఇస్తూ, మరల తిరిగి టాయిలెట్ల క్లీనింగ్ కి అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం విరుద్ధం.
  • కేంద్ర మంత్రులు మన రాష్ట్రానికి వచ్చి కేంద్ర నిధులని రాష్ట్రం వాడుకోవడం చాలా దౌర్భాగ్యమని విమర్శిస్తున్నారు.
  • జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రుల ద్వారా మన రాష్ట్రాన్ని తిట్టించటం జనసేన పార్టీ నుండి మేము ఖండిస్తూ ఉన్నాము.
  • వారాహి వాహనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
  • ఎలాగైనా వారాహి వాహనాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది.
  • వారాహిని కాదు కదా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ని ఆపే దమ్ము ధైర్యం మీ ముఖ్య మంత్రి లేదు.
  • రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకి మంచి జరగాలంటే నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే తప్పితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు.
  • ఫిబ్రవరి 10వ తారీఖు చిలకలూరిపేట లోని చిట్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వకపోతే జనసేన పార్టీ నుండి నేను మా కార్యకర్తలు ఆమర నిరాహార దీక్షకి సిద్ధమవుతున్నాము అని ద్వజమెత్తిన బాలాజీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*